విమాన ప్రమాదం... అనుభవజ్ఞుడైన పైలట్ను కోల్పోయిన ఎయిరిండియా
కేరళలోని కోజికోడ్ కరీపూర్ ఎయిర్పోర్ట్లో జరిగిన విమాన ప్రమాదంలో అత్యంత అనుభవజ్ఞుడైన పైలట్ను కోల్పోయింది ఎయిరిండియా.. వైమానిక దళం 127వ కోర్సులో రాష్ట్రపతి నుండి స్వోర్డ్ ఆఫ్ హానర్తో టాపర్గా తన పోరాట ఎయిర్ పైలట్ శిక్షణను పూర్తి చేసిన తర్వాత.. 1981లో దీపక్ వసంత సాఠే.. భారత వైమానిక దళంలో నియమించబడ్డారు. ఆయన పైలట్ మాత్రమే కాదు.. కెప్టెన్ సాఠే పైలట్గా 30 ఏళ్లకు పైగా సేవలు అందించిన అనుభవం ఉన్న అధికారి. వింగ్ కమాండర్ దీపక్ వసంత సాఠే భారత వైమానిక దళం సర్కిల్స్లో అత్యంత గౌరవనీయమైన పేర్లలో ఒకటిగా చెబుతారు.
భారత వైమానిక దళంలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన.. తర్వాత.. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో నిపుణుల పరీక్ష పైలట్గా చేరారు. ఇక, కేరళలో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో.. 191 మంది ప్రయాణికులు ఉండగా.. పైలట్ సహా 15 మంది మరణించారు. మరో 123 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కెప్టెన్ దీపక్ వసంత సాఠే మృతి చెందగా.. అఖిలేష్ కుమార్ అనే అతని కో-పైలట్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో కనీసం 15 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారి అబ్దుల్ కరీం వెల్లడించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)