ప్రభాస్ సినిమాలో ఎయిర్ టెల్ మోడల్ ..!!
బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే యాక్షన్ మేకింగ్ వీడియో చాప్టర్ 1 ను రిలీజ్ చేశారు. జేమ్స్ బాండ్, ఫాస్ట్ ఫ్యూరియస్ సినిమాలు ఎలా ఉంటాయో.. మేకింగ్ వీడియో అలాగే ఉన్నది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఒకవైపు సాహో కంప్లీట్ చేస్తూనే.. ప్రభాస్ తన 20 వ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1970 కాలానికి చెందిన సినిమాగా తెరకెక్కుతున్నది. ఇటీవలే ఇటలీలో ఈ సినిమా ప్రారంభమైంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారట. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎయిర్ టెల్ యాడ్ తో పాపులరైనా సాషా ఛెత్రి సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తున్నది. 2020 లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)