ఏపీ కరోనా అప్డేట్ : 100కు దిగువగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 81 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,066 కి చేరింది. ఇందులో 8,77,212 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,713కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,713 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 263 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)