ఏపీ కరోనా అప్డేట్... భారీగా తగ్గిన కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఇవాళ మళ్లీ కాస్త తగ్గాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,84,825 కి చేరింది. ఇందులో 8,76,383 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1289 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,153 కి చేరింది. ఇక పోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 147 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)