షాకింగ్.. జీడీపీలో భారత్ను దాటనున్న బంగ్లాదేశ్..!
జీడీపీ పరంగా ఈ ఏడాది భారత్ను బంగ్లాదేశ్ దాటనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ షాకింగ్ వివరాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10.3 శాతానికి తగ్గిపోనుందని తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ ఐఎంఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. 2021 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి భారత తలసరి స్థూల జాతీయోత్పత్తి 10.3 శాతం తగ్గి 1877 డాలర్లకు చేరుకోనుందని ఐఎంఎఫ్ తన నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 1888 డాలర్లకు పెరుగుతుందని ఆ నివేదిక పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు 4.5 శాతం తగ్గిపోనుందని జూన్లో వెలువరించిన అంచనాల్లో పేర్కొనగా.. తాజాగా దాన్ని మరింత తగ్గించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)