మగువలకు బ్యాడ్ న్యూస్: పెరిగిన బంగారం ధరలు
దేశంలో గత కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉండటంతో పాటుగా, దేశీయంగా కూడా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆదివారం రోజున బంగారం ధరలు కొంతమేర పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.43,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరిగి రూ.48,180కి చేరింది. అయితే, వెండి ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ.73,800కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)