గుడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన బంగారం ధరలు
మన దేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి. అందుకే బంగారానికి దేశంలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ధరలు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాయి. ఏ మాత్రం ధరలు తగ్గినా, పెద్ద సంఖ్యలో బంగారం కొనుగోలు జరుగుతుంది. అయితే.. కరోనా విజృంభణ తర్వాత బంగారం ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే.. ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి బంగారం ధరలు. తాజాగా.. మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 45, 150 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెరిగి రూ. 49, 260 కి చేరింది. ఇక వెండి కూడా ఇదే బాటలో నడిచింది. కిలో వెండి ధర రూ. 3100 పెరిగి రూ. 67, 700 కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)