పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు భారత్...
మొతేరా టెస్టులో విజయంతో... టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ను వెనక్కి నెట్టి... ఫస్ట్ ప్లేస్కు చేరుకుంది. తాజా, ఓటమితో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అర్హత రేసు నుంచి... నిష్క్రమించింది ఇంగ్లండ్ జట్టు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో.. భారత్కు మళ్లీ మొదటి స్థానం దక్కింది. మొతేరా స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు విజయంతో.. ఈ ఘనత సాధించింది టీమిండియా. ఇప్పటికే 70శాతం విజయాలతో..ఫైనల్ చేరుకున్న న్యూజిలాండ్ను అధిగమించింది. ప్రస్తుతం 71% విజయాల రేటు, 490 పాయింట్లతో నంబర్వన్గా భారత్ అవతరించింది. ఇక ఛాంపియన్షిప్ ఫైనల్ అర్హత రేసులోంచి ఇంగ్లీష్ జట్టు నిష్క్రమించింది.
మొతేరా వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్పై టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేషించిన 49 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన సునాయాసంగా ఛేదించింది. యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ 11, అశ్విన్ 7 వికెట్లు నేలకూల్చి... ఇంగ్లాండ్ను భారీ దెబ్బకొట్టారు. ఈ ఓటమితో ఇంగ్లిష్ జట్టు సిరీసులో 1-2తో వెనకబడింది. ఫలితంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్కు దూరమైంది.
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్కు అర్హత సాధించే అవకాశాలు రెండు జట్లకే ఉన్నాయి. ఇంగ్లాండ్తో నాలుగో టెస్టును గెలిచినా, డ్రా చేసుకున్నా భారత్ 2-1 లేదా 3-1తో ఫైనల్కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే 2-2 సిరీస్ సమం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను అదృష్టం వరిస్తుంది. అప్పుడు ఆసీస్తో కివీస్ పోరాడాల్సి ఉంటుంది. అయితే ఇలా జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీసేన నాలుగో టెస్టును డ్రా చేసుకోగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)