పాక్ విజయం.. కైఫ్పై విమర్శలు
పాకికిస్థాన్ విజయం సాధిస్తే మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్పై విమర్శలు ఏంటని అనుకుంటున్నారా?. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు టీ-20 సిరీస్ను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. టీ-20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై పాక్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ ఫఖర్ జమాన్ (46 బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్తో పాక్ను ముందుండి గెలిపించాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ ఫఖర్ జమాన్పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు.
'ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి ముక్కోణపు టీ-20 సిరీస్ను సాధించిన పాకిస్థాన్ జట్టు అద్భుతం. ఈ మ్యాచ్ లో ఫఖర్ జమాన్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ లా కనబపడుతున్నాడు.. కంగ్రాచ్యులేషన్స్' అంటూ కైఫ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు స్పందించిన నెటిజన్లు కైఫ్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 'దేశ ద్రోహి'.. 'పాక్ గెలిస్తే మీరు సంతోషపడతారా'.. 'పాక్ పై ఎంత ప్రేమ చూపిస్తున్నారో' అంటూ విమర్శల దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన పోస్టులు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Well done to Pakistan on winning the T20 series final against Australia. Great innings from Fakhar Zaman , looks a big match player.
— Mohammad Kaif (@MohammadKaif) July 8, 2018
Congratulations #PakvAus
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)