తన ఓటమిపై తొలిసారి స్పందించిన కవిత..
సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మరోసారి బరిలోకి దిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఓటమిపాలయ్యారు. ఈ స్థానంలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక తన ఓటమిపై తొలిసారి స్పందించారు కవిత... తన నియోజకవర్గ పరిధిలోని మంచిప్పలో గుండెపోటుతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయినా నిజామాబాద్ను విడిచేదిలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న కవిత.. ఈ సారి జిల్లా ప్రజలు తనను కాదని వేరే వారిని గెలిపించారు.. గెలిచిన వారు హామీలు నెరవేర్చాలని సూచించారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చిన కవిత... ప్రజల మధ్యలో.. ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వెల్లడించారు.
Addressed Media at Manchippa Village, Nizamabad. pic.twitter.com/UlzfrZrudy
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 27, 2019
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)