శాంతించిన మహేష్ ఫ్యాన్స్ !
సూపర్ స్టార్ మహేష్ యొక్క 'మహర్షి' సినిమా గురించి అప్డేట్ వచ్చి ఛాన్నాళ్ళే అయింది. దానిళి తోడు సినిమా వాయిదాపడటంతో ఎంతగానో ఎదురుచూసిన అభిమానులు నిరాశకు లోనయ్యారు. పలుమార్లు సోషల్ మీడియా వేదికగా నిర్మాతల్ని అప్డేట్స్ అప్పుడో చెప్పండి అంటూ ప్రశ్నించారు కూడా. ఫ్యాన్స్ పరిస్థితిని అర్థంచేసుకున్న నిర్మాతలు సినిమా ఫస్ట్ సింగిల్ మార్చి 29న వస్తుందని అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కొద్దిగా శాంతించారు. దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డేవిస్ రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)