‘ఎఫ్సీయూకే' నుంచి "మనసు కథ" పాట విడుదల
జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'ఎఫ్సీయూకే' (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్). ఈ చిత్రంలోని మూడో పాట "మనసు కథ"ను ఇదివరకు అనౌన్స్ చేసినట్లుగానే అదనపు డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్ రావు చేతుల మీదుగా విడుదల చేయించారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో బేబి సహశ్రిత మరో కీలక పాత్రధారి. అయితే పాట విడుదల సందర్భంగా ప్రధాన పాత్రధారులు జగపతి బాబు మాట్లాడారు. పోలీసువారంటే తనకు చాలా గౌరవమనీ, కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న కాలంలో వారు అందించిన సేవలు చూశాక ఆ గౌరవభావం రెట్టింపయ్యిందనీ జగపతిబాబె చెప్పుకొచ్చారు. అయితే సాధారణంగా పోలీస్ అధికారులంటే నిర్విరామంగా ఏడాది పొడవునా ప్రతిరోజూ 24 గంటల సేపు సీరియస్గా తమ విధులను నిర్వర్తిస్తుంటారని మనకు తెలుసు. కానీ వారిలోనూ సరదా కోణం ఉంటుందనే విషయం అదనపు డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్ రావు గారు "మనసు కథ" పాటను లాంచ్ చేసి, దానిని ప్రొఫెషనల్ సింగర్ తరహాలో రాగయుక్తంగా పాడటంతో మరోసారి తెలిసింది. ఆయన తన రంగానికి సంబంధించిన అనుభవాలను గుర్తుచేసుకొని, "మనసు కథ" పాటతో తాను ఎలా కనెక్ట్ అయ్యానని అన్నారు. బిజీ షెడ్యూల్లోనూ తమ సమయాన్ని కేటాయించి, ఈ పాట విడుదల చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులకు హీరో రామ్ కార్తీక్ ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత హీరోలకు తమ వంతు కృతజ్ఞతలు తెలియజేయడానికి శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తమను ఎంతగానో అలరిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)