ప్లీజ్ ఉల్లి దోసను అడక్కండి...
దేశంలో ఉల్లి ఘాటు పెంచుతోంది. రేటు చూస్తే గుండె పోటు వస్తోంది. రోజు రోజుకు రేటు పెరిగిపోతుండటంతో ఉల్లిని కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో ఉల్లి ధరలు కొండెక్కడంతో అక్కడి రెస్టారెంట్ సిబ్బంది ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి ధరలు తగ్గేవరకు బెంగళూరు రెస్టారెంట్ లో ఉల్లి దోసను నిషేదించాలని బెంగళూరు రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఓ తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం రేట్లు తగ్గేవరకూ అక్కడ ఉల్లి దోస కనిపించదు. పాపం బెంగళూరు వాసులకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)