ఎంబీబీఎస్, బీడీఎస్ నోటిఫికేషన్ విడుదల
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ -2020లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది యూనివర్సిటీ... అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటల నుండి 7వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www .knruhs.telangana.gov.in ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)