సహారా గ్రూప్ అధినేతకు సెబీ అల్టిమేటం.. రూ.62,600 కోట్లు కట్టాల్సిందే..!
సహారా ఇండియా పరివార్ గ్రూపు అధినేత సుబ్రతా రాయ్కు సెబీ ఆల్టిమేటం జారీ చేసింది. సుబ్రతా రాయ్ తక్షణం 62,600 కోట్ల రూపాయలు కట్టాలని.. లేదంటే ఆయనకు పెరోల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాయ్కి చెందిన రెండు గ్రూపులు, వడ్డీతో సహా మొత్తం 62,600 కోట్లు చెల్లించాలని సెబీ తన పిటిషన్లో పేర్కొంది. అయితే, 8 ఏళ్ల క్రితం సుబ్రతా రాయ్పై కేవలం 25,700 కోట్ల రూపాయల భారం మాత్రమే ఉండేది. 2012లో సహారా గ్రూపు కంపెనీలు సెక్యూర్టీ చట్టాలను ఉల్లంఘించి సుమారు 3.5 బిలియన్ల డాలర్ల సొమ్మును సమీకరించినట్లు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎటువంటి బ్యాంకింగ్ సదుపాయాలు లేనటువంటి సహారా కంపెనీ.. లక్షల సంఖ్యలో భారతీయుల అక్రమ రీతిలో సొమ్ము సమీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇన్వెస్టర్లను గుర్తించడంలో విఫలమైన సెబీ.. ఈ కేసులో రాయ్ను జైలుకు పంపింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)