సాహో యూనిట్ తోనే మళ్ళీ సుజిత్ ..!!?
సుజిత్ దర్శకత్వం వహించింది రెండు సినిమాలే. అందులో మొదటి సినిమా శర్వానంద్ హీరోగా చేసిన రన్ రాజా రన్ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సుజిత్ దర్శకత్వంపై అందరికి గురి కుదిరింది. సాహో వంటి భారీ ప్రాజెక్ట్ ను సుజిత్ చేతుల్లో పెట్టారు. సుజిత్ ఈ ప్రాజెక్ట్ ను ఛాలెంజ్ గా తీసుకొని ప్రభాస్ తో సినిమా తీశాడు.
కానీ, ఈ సినిమా సౌత్ లో ఫెయిల్ అయ్యింది. బాలీవుడ్ లో మాత్రం భారీ హిట్టయింది. దాదాపు రూ. 450 కోట్లు కలెక్ట్ చేసినా.. నష్టాలను చవిచూడాల్సి వచ్చింది ఈ సినిమా పరాజయం తరువాత సుజిత్ తో సినిమా అంటే నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. కానీ, యూవీ క్రియేషన్స్ మాత్రం సుజిత్ తో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యింది. సుజిత్.. శర్వానంద్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇవ్వబోతున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)