భారత్ కి 38 మిలియన్ డాలర్లు బకాయిపడ్డ ఐక్యరాజ్యసమితి
ఐక్యరాజ్యసమితి భారత్ కు 38 మిలియన్ డాలర్లు బకాయి పడింది. మార్చి 2019 వరకు భారత్ చేపట్టిన శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు 38 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చెప్పినట్టు ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ఐరాస బకాయిపడ్డ దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉండగా రువాండా (31 మిలియన్ డాలర్లు), పాకిస్థాన్ (28 మిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (25 మిలియన్ డాలర్లు), నేపాల్ (23 మిలియన్ డాలర్లు)లకు కూడా బకాయిలు చెల్లించాల్సి ఉందని గుటెరెస్ తన నివేదికలో తెలిపారు.
ఐక్యరాజ్యసమితి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపై రిపోర్ట్ తయారు చేసిన గుటెరెస్, మార్చి 31, 2019 నాటికి ఐక్యరాజ్యసమితి 265 మిలియన్ డాలర్లను వివిధ దేశాలకు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ప్రపంచ సంస్థ శాంతిపరిరక్షణ కార్యక్రమాలకు తమ సైన్యాలు, పోలీసులను పంపి చురుకైన పాత్ర పోషించినందుకు ఆయా దేశాలకు బకాయి పడినట్టు తెలిపారు. జూన్ 2019 నాటికి ఇది 588 మిలియన్ డాలర్లు చేరే అవకాశం ఉందని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)