విదేశాల్లో వరుణ్ తేజ్ కఠోర శ్రమ !
ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో గ్రాండ్ విక్టరీ అందుకున్న వరుణ్ తేజ్ 'వాల్మీకి' అనే కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నాడు. తమిల్ హిట్ సినిమా 'జిగర్తాండ'కు ఇది రీమేక్. అందులో బాబీ సింహ చేసిన పాత్రను తెలుగులో వరుణ్ చేయనున్నాడు. ఈ పాత్ర కోసం బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు వరుణ్. దానికి సంబందించిన ట్రైనింగ్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్ళాడు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి శిక్షణ తీసుకోనున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుకానున్న ఈ చిత్రంలో కథానాయకిగా మృణాళినీ రవి, ఈషా రెబ్బ పేర్లను పరిశీలిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)