మహిళల ఆర్చరీలో రజతం
ఆసియా క్రీడలలో భారత్ కు మరో రజత పతకం దక్కింది. అద్భుత ప్రతిభతో ఫైనల్ చేరిన భారత మహిళా ఆర్చరీ జట్టు, ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో పోరాడి ఓడింది. చివరి దాకా పోరాడిన జ్యోతి సురేఖ నేతృత్వంలోని ఆర్చరీ టీం, వెంట్రుకవాసిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. దక్షిణ కొరియా చేతిలో 231- 228 పాయింట్ల తేడాతో ఓడిన ఆర్చరీ జట్టు, సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది.
భారత మహిళా ఆర్చరీ జట్టు ఆరంభంలో అద్భుతంగా గురి చూసి కొట్టింది. తొలి రౌండ్లో 30 పాయింట్లు సాధించి స్వర్ణంపై ఆశలు రేపింది. దక్షిణ కొరియా, భారత్ జట్ల మధ్య చివరి దాకా హోరాహోరీగా పోటీ సాగింది. చివరి రౌండ్లో భారత్ విజయానికి 30 పాయింట్లు కావాల్సి ఉండగా భారత జట్టు 27 పాయింట్లే సాధించగలిగింది. కేవలం 3 పాయింట్ల తేడాతో స్వర్ణపతకం మిస్సయింది.
#TeamIndia at the #AsianGames2018
— Team India (@ioaindia) August 28, 2018
Silver No. 14 for India as the Women's Compound #Archery team bows out against South Korea by 228-231 in the Compound Archery Women's Team Finals event. #WellDone #MuskanKirar #Madhumita #JyothiSurekha ????????????????#IAmTeamIndia pic.twitter.com/2WJ4D75cN2
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)