ఎన్టీఆర్ గురించి 'యాత్ర' దర్శకుడు !
దర్శకుడు మహిళ వి రాఘవ్ 'యాత్ర' పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రేపే రిలీజ్ కానుంది. ఈ సినిమా పట్ల ఒక వర్గం ప్రేక్షకుల్లో కొంత వ్యతిరేకత మొదటి నుండి ఉంది. దీని గురించి మహి వి రాఘవ్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ ఈ మట్టి వారసులు. గొప్ప కీర్తిని వదిలి వెళ్లారు' అన్నారు.
అలాగే మన అభిప్రాయ బేధాలతో వారిని అవమానపరచవద్దు. నేను వైఎస్సార్, చిరంజీవికి అభిమానిని అయినంత మాత్రాన ఇతరుల పట్ల దేవర్షాన్ని పెంచుకుంటానని అర్థం కాదు. ఈ సినిమాను ఇతర సినిమాలతో పోల్చకండి. వైఎస్సార్ ప్రయాణాన్ని సంతోషంగా ఆస్వాదించండి' అంటూ విజ్ఞప్తి చేశాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)