టీడీపీ అభ్యర్థి కారుపై వైసీపీ రాళ్ల దాడి
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిరెడ్డి కారుపై వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం రాళ్ల దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)