కేంద్ర ఎన్నికల కమిషన్తో వైసీపీ నేతల భేటీ..
ఏపీ రాజకీయాలు కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ తిరుగుతున్నాయి. కాసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిశారు వైసీపీ ఎంపీలు, మాజీ ఎంపీల బృందం.. నేతల టీమ్లో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బుట్టా రేణుక, పండుల రవీంద్ర బాబు, అవంతి శ్రీనివాస్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులున్నారు. ఈనెల 23న జరిగే కౌంటింగ్ కి ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. కౌంటింగ్ రోజున తెలుగుదేశం పార్టీ అలజడులు సృష్టించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అలాంటి చర్యలను తిప్పికొట్టడానికి కౌంటింగ్ కేంద్రాలకు అదనపు భద్రత కల్పించడం, కౌంటింగ్ రోజున మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం, ప్రత్యేక పర్యవేక్షకులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
వైసీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లిన అంశాలు:
* కౌంటింగ్ ప్రక్రియ, స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి.
* చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ కట్టుదిట్టమైన చర్యల మధ్య పారదర్శకంగా జరపాలి.
* కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు టీడీపీ ప్రయత్నించే అవకాశం ఉంది.
* చంద్రగిరి, ఉరవకొండ, మంగళగిరి, రాప్తాడు దెందులూరు, ధర్మవరం తాడిపత్రి, గాజువాక, రాజంపేట గురజాల, చిలకలూరిపేట, వైజాగ్ ఈస్ట్, గుడివాడ , మైలవరం , గన్నవరం, తుని, భీమవరం తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఉద్దేశపూర్వకంగా గొడవ సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది.
* సమస్యాత్మక నియోజకవర్గాల్లో అదనపు పోలీసు బలగాలను బయటి రాష్ట్రాల నుంచి నియమించాలి.
* రాప్తాడు రిటర్నింగ్ ఆఫీసర్ ను మార్చాలి.
* “మాక్ పోలింగ్”లో ఉపయోగించిన వీవీ ప్యా ట్ స్లిప్పులు తొలగించని పక్షంలో ఓట్ల లెక్కింపులో తేడా వచ్చే అవకాశం ఉంది. దీనిపై తగిన మార్గదర్శకాలను ఎన్నికల సంఘం వెలువరించాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)