మహబూబాబాద్ - మహబూబాబాద్

మహబూబాబాద్ (ఎస్టీ) నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,11,688. అందులో పురుషులు - 1,05,854, మహిళలు - 1,05,809, థర్డ్ జెండర్ - 25 మంది ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ను రంగంలోకి దింపింది టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుంచి పోరిక బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి జ్యోతుల హుస్సేన్ నాయక్, బిఎల్ఎఫ్ నుంచి భానోత్ మోహన్ లాల్ (బిఎల్పీ) ఎన్నికల బరిలోకి దిగారు.
2014 సాధారణ ఎన్నికల్లో మహబూబాబాద్ గిరిజన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాలోతు కవితను టిఆర్ఎస్ అభ్యర్ధి శంకర్ నాయక్ ఓడించారు. కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కుమార్తె. ఈ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ ప్రభావం చేత కవిత ఓడిపోతే, ఈమె తండ్రి రెడ్యా నాయక్ డోర్నకల్ నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందడం విశేషం. శంకర్ నాయక్ 9315 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టిడిపి-బిజెపి కూటమి తరపున పోటీ చేసిన బాలూ చౌహన్ కు 15680 ఓట్లు వచ్చాయి. డీ-లిమిటేషన్ తర్వాత మహబూబాబాద్ నియోజకవర్గం గిరిజనులకు రిజర్వు అయ్యింది.
మొత్తం 12సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు పిడిఎఫ్, ఎస్.పి.పిఎఫ్ చెరోసీటు గెలుచుకున్నాయి.
1972 నుంచి 1989 వరకు వరుసగా ఐదుసార్లు జన్నారెడ్డి జనార్ధన్ రెడ్డి గెలుపొందారు. 1957, 62లలో చిల్లంచెర్ల నియోజకవర్గంలో గెలుపొందిన ఎం.ఎస్ రాజలింగం వరంగల్ లో మరోసారి గెలిచారు. 2004లో ఇక్కడ గెలిచిన టిడిపి నేత వి.నరేందర్ రెడ్డి ఈ నియోజకవర్గం రిజర్వు కావడం వల్ల పోటీ చేయలేకపోయారు.
ఈసారి కూడా బానోత్ శంకర్ నాయక్ ను టీఆర్ఎస్ నిలిపింది.
నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి... కాంగ్రెస్ పార్టీలో చేరికకు లైన్ క్లియర్ అయ్యింది... మాజీ పీసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్తో పాటు భూపతిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టీఆర్ఎస్కు ఎదురుగాలి ప్రారంభమైందని కాంగ్రెస్ నేత డీకే అరుణ అన్నారు. ఇవాళ ఆమె గాంధీభవన్లో మాట్లాడుతూ ఒక్కో సభ ద్వారా టీఆర్ఎస్ బలహీనపడుతోందన్నారు..పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి